అజ్ఞాతవాసి ఆడియోకి ఎన్టీఆర్ ?

Sunday,December 17,2017 - 10:19 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ ఫాస్ట్ ఫేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ నెల19న  మేకర్స్ గ్రాండ్ గా  ఆడియో వేడుక చేయబోతున్న సంగతి తెలిసిందే. అనిరుద్ తెలుగులో మ్యూజిక్ అందించిన మొదటి సినిమా కావడంతో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ ఈ ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడని. అలాగే సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఈవెంట్ కి ఎటెండ్ కానున్నడని సమాచారం.

హైదరాబాద్ లో హెచ్.ఐ.సి.సి నోవెటల్ లో జరగనున్న ఈ వేడుకకు సంబంధించి
ఇప్పటికే పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. లేటెస్ట్ గా విడుదలైన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకోగా మిగిలిన పాటలను ఈ వేడుకలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు యూనిట్. సో ఈ ఆడియో వేడుక టాలీవుడ్ లో మరో బిగ్ ఈవెంట్ కానుందన్నమాట.