కళ్యాణ్ రామ్ కోసం మరోసారి గెస్ట్ గా మారిన ఎన్టీఆర్

Monday,March 19,2018 - 10:02 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ఎం.ఎల్.ఎ రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చ్ 23 న థియేటర్స్ లోకి రానుంది. అయితే రిలీజ్ కి రెండు రోజుల ముందు అంటే 21 న ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రానున్నాడని సమాచారం. ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన కొన్ని ఫంక్షన్స్ కి గెస్ట్ గా ఎటెండ్ అయిన తారక్ మరో సారి అన్నయ్య కోసం గెస్ట్ అవ్వబోతున్నాడట.

కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఉపేంద్ర మాధవ్ దర్శకుడు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాను భరత్ చౌదరి, M.V. కిరణ్ రెడ్డి నిర్మించారు.