ఘ‌న‌కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మ‌ణిదీప‌కా

Sunday,December 02,2018 - 08:41 by Z_CLU

రెండు భాగాలుగా వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఫస్ట్ పార్ట్ పాటల వేడుక షురూ అయింది. ఎన్టీఆర్-కథనాయకుడు సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. కీరవాణి స్వరపరిచిన ఈ పాట వింటే ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవ్వాల్సిందే. ఆ పదాలు, ఆ మ్యూజిక్ అంతలా సింక్ అయ్యాయి.

కే.శివదత్తా, కె.రామకృష్ణ కలిసి అందించిన ఈ సాహిత్యాన్ని తన సంగీతంతో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు కీరవాణి. ఈ పాటతో బాహుబలి మ్యూజిక్ ను మరోసారి గుర్తుచేశారు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం డైరక్టర్ క్రిష్, కీరవాణినే ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడో ఈ పాట వింటే అర్థమైపోతుంది.

ఎన్టీఆర్ గెటప్స్, ఆయన గుణాల్ని వర్ణిస్తూ అచ్చతెలుగు పదాలతో రాసిన ఈ పాట వినగానే ఆకట్టుకుంటుంది. కథానాయకుడు సినిమాలో ఈ పాట టైటిల్స్ లో వస్తుందనే టాక్ వినిపిస్తోంది. పాట మాత్రం అదిరిపోయింది.

కైలాష్ ఖేర్ ఈ పాటకు తన గాత్రంతో ప్రాణంపోశాడు. తెలుగు రాకపోయినా తెలుగు పదాల్ని స్పష్టంగా ఉచ్ఛరిస్తూ పాటంటే తనకు ఎంత ప్రాణమో మరోసారి నిరూపించాడు.