బివిఎస్.రవి నిర్మాతగా సాగర్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్
Wednesday,September 30,2020 - 05:34 by Z_CLU
హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన రచయిత మరియు దర్శకుడు బివిఎస్.రవి మళ్లీ నిర్మాతగా మారనున్నారు. గతంలో సెకండ్ హ్యాండ్ అనే సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమలని తెలుగు చిత్ర సీమకు పరిచయం చేసిన బీవిఎస్ రవి ఇప్పుడు రమేశ్ ను దర్శకుడిగా లాంఛ్ చేస్తున్నారు.
మొగలిరేకులు సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాగర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఎప్పటినుంచి బివిఎస్ రవికి, నటుడు సాగర్ కి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే సాగర్ ని హీరోగా మరోమారు ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నారు రవి.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా ప్రాధాన్యం ఉండబోతోంది. ఇంతవరకు తెలుగు చిత్ర సీమలో ఎన్నడు రాని ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఈ సినిమాలో కథనాయక పాత్రని తీర్చిదిద్దుతున్నట్లుగా సమాచారం.