విజయ్ దేవరకొండకి కలిసొచ్చిన సెంటిమెంట్

Saturday,September 29,2018 - 10:02 by Z_CLU

అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది విజయ్ దేవరకొండ ‘నోటా’. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మోస్ట్ ఇంటెన్సివ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ సినిమా దర్శకుడు ఆనంద్ శంకర్ ఈ స్క్రిప్ట్ ని విజయ్ దేవరకొండ కన్నా ముందు అల్లు అర్జున్ కి వినిపించాడట.

ఆనంద్ శంకర్ చెప్పిన కథ విన్న బన్ని, ఈ స్క్రిప్ట్ తనకు సూట్ కాదన్న రీజన్ తో నో చెప్పాడట. అపుడు ఆనంద్ శంకర్ విజయ్ దేవరకొండను సంప్రదించడం, విజయ్ సూపర్ ఎగ్జైటెడ్ అయిపోయి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇమ్మీడియట్ గా సినిమా సెట్స్ పైకి రావడం లాంటివి చకచకా జరిగిపోయాయి.

ఒక్క నోటా విషయంలోనే కాదు, విజయ్ దేవరకొండ రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గీతగోవిందం’ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ సినిమా దర్శకుడు పరశురాం ఈ స్టోరీని ముందు వినిపించింది ఆలు అర్జున్ కే. ఆ సబ్జెక్ట్ తనకు సూట్ కాదనే, విజయ్ దేవరకొండని రిఫర్ చేశాడట అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

ఇపుడదే సెంటిమెంట్ ‘నోటా’ కి కూడా వర్తించేలా కనిపిస్తుంది. అల్లు అర్జున్ రెఫ్యూజ్ చేసిన సబ్జెక్ట్ కాబట్టి, ‘నోటా’ కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకోవడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. శ్యామ్ C.S. మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని K.E. జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నాడు.