ఎన్టీఆర్ సరసన నివేదా థామస్
Wednesday,April 12,2017 - 11:12 by Z_CLU
జై లవకుశ ప్రాజెక్టులోకి నివేదాా థామస్ అఫీషియల్ గా చేరింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. నివేదాా స్టిల్ తో జై లవకుశ లోగోతో ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. త్వరలోనే యంగ్ టైగర్ తో కలిసి సెట్స్ లో జాాయిన్ కాబోతోంది నివేద.
తెలుగులో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది నివేదా ధామస్. నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, తన రెండో ప్రాజెక్టును కూడా నేచురల్ స్టార్ తోనే చేస్తోంది. వీళ్లిద్దరూ కలిసి ప్రస్తుతం నిన్ను కోరి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అవ్వడంతో, ఎన్టీఆర్ మూవీకి కాల్షీట్లు కేటాయించింది నివేద.
దర్శకుడు బాబి డైరక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ ప్రాజెక్టులో.. తారక్ 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు. దీనికోసం ఇప్పటికే హాలీవుడ్ మేకప్ టెక్నీషియన్స్ ను తీసుకున్నారు.