Nithin - మరో మూవీ ఓకే చేశాడా?

Friday,April 30,2021 - 07:58 by Z_CLU

‘భీష్మ’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ప్రస్తుతం వరసగా సినిమాలు చేస్తూ స్పీడ్ పెంచేశాడు. ఇటివలే ‘చెక్’,’రంగ్ దే’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్ ప్రస్తుతం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘అంధదూన్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ‘పవర్ పేట’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత చేయబోయే మరో సినిమాను కూడా ఫైనల్ చేసుకున్నాడట నితిన్. అవును ‘ఆనందో బ్రహ్మ’,’యాత్ర’ సినిమాల దర్శకుడు మహి వి రాఘవ్ తో నితిన్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.

యాత్ర తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసుకున్న మహి ప్రస్తుతం ఆ సీక్వెల్ ను పక్కన పెట్టి ఓ కథను సిద్దం చేసుకున్నాడట. ఆ స్క్రిప్ట్ తాజాగా నితిన్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని తెలుస్తుంది. స్క్రిప్ట్ నచ్చడంతో నితిన్ ఈ డైరెక్టర్ తో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ఎనౌన్స్ కానుంది.

ప్రస్తుతం లిస్టులో ఉన్న రెండు సినిమాలు పూర్తయిన వెంటనే మహి సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడట నితిన్. పవర్ పేట ను రెండు భాగాలుగా తీయనున్నారు కాబట్టి ఆ సినిమా షూట్ కి ఎక్కువ సమయం పడుతుంది. మరి ఆ సినిమా అయ్యాకే ఈ సినిమాను మొదలు పెడతాడా ? లేదా ఓకె టైంలో రెండు సినిమాలు ఫినిష్ చేస్తాడా ? చూడాలి. ఏదేమైనా నితిన్ -మహి కాంబో ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొల్పుతుంది. ఈ ఇద్దరూ ఎలాంటి కథతో సినిమా చేస్తారనేది మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics