మూడు సినిమాలతో నితిన్ ఫుల్ బిజీ

Sunday,April 08,2018 - 10:10 by Z_CLU

‘ఛల్ మోహన్ రంగ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు.  ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకు సంబంధించి ఇప్పటికే మొదటి షెడ్యుల్ ఫినిష్ చేసిన నితిన్ ఈ నెల 17 నుండి మరో షెడ్యుల్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో శర్వానంద్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్ననితిన్ మరో వైపు ‘ఛలో’దర్శకుడు వెంకీ కుడుముల తో కూడా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

మొన్నటి వరకూ సినిమా కంప్లీట్ అయ్యాకే మరో సినిమా గురించి ఆలోచించే నితిన్ నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త స్పీడ్ పెంచేసాడు. ఓ వైపు ‘శ్రీనివాస కళ్యాణం’ షూటింగ్ పాల్గొంటూనే గ్యాప్ దొరికినప్పుడల్లా హరీష్ శంకర్ , వెంకీ కుడుముల తో నెక్స్ట్ సినిమాల గురించి డిస్కర్షన్ చేస్తూ బిజీ బిజీ గా గడుపుతున్నాడట. సో నితిన్ మునుముందు ఇదే స్పీడ్ మెంటైన్ చేస్తాడా..చూడాలి.