నిఖిల్ `కిరాక్ పార్టీ` తొలి పాట విడుదల
Tuesday,January 23,2018 - 10:21 by Z_CLU
వరుస విజయాలతో, వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు నిఖిల్ నటిస్తున్న 15వ చిత్రం `కిరాక్ పార్టీ`. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. సిమ్రన్ పర్జీనా, సంయుక్త హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. ఏ టీవీ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మాత. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని తొలి పాట `దమ్ దారే` ని విడుదల చేశారు.
వనమాలి రచించిన ఈ గీతాన్ని హరి చరణ్ ఆలపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రముఖ దర్శకులు సుధీర్ వర్మ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండగా, మరో దర్శకుడు చందూ మొండేటి డైలాగ్స్ అందించడం విశేషం. “ఇటీవల విడుదల చేసిన ప్రీ టీజర్కి మంచి స్పందన వచ్చింది. `దమ్ దారే` పాట యువతతో పాటు అందరినీ ఆకట్టుకుంటుంది. మిగిలిన పాటల్ని ఒకొక్కటిగా విడుదల చేస్తామ“ని చిత్రబృందం తెలిపింది.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: శరన్ కొప్పిశెట్టి
సంగీతం: అజనీష్ లోక్నాథ్
కళ: అవినాష్
ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మ