మోస్ట్ ఎవెయిటింగ్ సీక్వెల్ కార్తికేయ2 మొదలైంది. నిఖిల్-చందు మొండేటి కాంబినేషన్ లో తిరుమలలో ఈరోజు ఉదయం ఈ సినిమా అఫీషియల్ గా లాంఛ్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతోంది కార్తికేయ 2.
కార్తికేయ2 సినిమాకు సంబంధించి ఓపెనింగ్ కు ముందే ప్రీ-లుక్ రిలీజ్ చేశారు. పనిలోపనిగా టైటిల్ లోగోను కూడా రివీల్ చేశారు. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రతి మనిషిలో దైవం ఉంటుందనే కాన్సెప్ట్ ను టచ్ చేస్తూనే.. మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతోంది కార్తికేయ 2.
ఈరోజు లాంఛ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తారు. మూవీని ఇదే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్.
ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా పనిచేయబోతున్నాడు. మత్తువదలరా సినిమాతో పాపులర్ అయిన కాలభైరవ.. కార్తికేయ-2కు మ్యూజిక్ అందించబోతున్నాడు.