మరో సినిమా ప్రారంభించిన నిఖిల్

Saturday,March 03,2018 - 01:30 by Z_CLU

కిరాక్ పార్టీ ఇంకా థియేటర్లలోకి రాకముందే అప్పుడే మరో సినిమాను స్టార్ట్ చేశాడు నిఖిల్. విడుదలకు సిద్ధమైన కిరాక్ పార్టీ ఓ రీమేక్ మూవీ. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా ఓ రీమేక్ సినిమానే. తమిళ్ లో హిట్ అయిన కనితన్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.

ఒరిజినల్ వెర్షన్ ను డైరక్ట్ చేసిన సంతోష్ నే, ఈ రీమేక్ కోసం కూడా తీసుకున్నారు. హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. మొదట క్యాథరీన్ ను అనుకున్నారు. తర్వాత అర్జున్ రెడ్డి ఫేం షాలినీ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. కానీ ఏదీ పక్కా కాలేదు.

మూవీ డైనమిక్ ఎల్ఎల్సీ బ్యానర్ పై రాజ్ కుమార్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అరవింద్ కృష్ణ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్. కిరాక్ పార్టీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త రీమేక్ సంగతుల్ని అఫీషియల్ గా బయటపెడతారు.