నీవెవరో మూవీ.. నాకు కలిసొచ్చే సినిమా
Monday,August 20,2018 - 11:21 by Z_CLU
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్స్గా నటించిన చిత్రం ‘నీవెవరో`. కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా బ్యానర్లపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 24న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా వైజాగ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది.
హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ – ఈ సినిమాలో మంచి కథ ఉంది. దాంతో పాటు మంచి నిర్మాతలు దొరికారు. కోన వెంకట్ గారు.. లేరంటే ఈ కథే లేదు. ఆయన చెబితేనే ఈ కథ విన్నాను. నచ్చింది.. సినిమా కోనగారి వల్లే స్టార్ట్ అయ్యింది. తాప్సీ, రితికా ఇలా అందరూ ఒక్కొక్కరుగా సినిమాకు యాడ్ అవుతూ వచ్చారు.
నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ – వైజాగ్ బ్యాక్ డ్రాప్తో..2003లో విడుదలైన `వెంకీ` చిత్రం రైటర్గా నాకొక స్థానాన్ని కల్పించింది. ఆ రోజు నుండి నా సినిమాల్లో వైజాగ్ సెంటిమెంట్గా మారిపోయింది. నీవెవరో సినిమా ఆది పినిశెట్టి కెరీర్లో ఓ మైల్స్టోన్ మూవీ అవుతుంది. నేను హీరోలకు ఫస్ట్టైమ్ స్క్రీన్ప్లే, డైలాగ్స్ రాసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. అదే సెంటిమెంట్తో చెబుతున్నాను. ఆదికి ఈ సినిమాతో గొప్ప కెరీర్ దొరుకుతుంది.
నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ – కోన వెంకట్గారు కథ చెప్పగానే బాగా నచ్చింది.. వెంటనే ఆది పినిశెట్టి ని కలిశాం. తాప్సి కూడా నటించడానికి అంగీకరించారు. రితికా కూడా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్న మూవీ ఇది. ఈ నెల 24న విడుదలవుతున్న నీవెవరో చిత్రాన్ని ప్రేక్షకులు పెద్ద హిట్చేస్తారని నమ్మకంగా ఉన్నాం“ అన్నారు.