`వాసుకి` చిత్రానికిగానూ నయనతారకు ఫిలింఫేర్
Tuesday,June 20,2017 - 11:18 by Z_CLU
స్టార్ హీరోయిన్ నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `వాసుకి`. మలయాళ చిత్రం `పుదియ నియమం` చిత్రానికి డబ్బింగ్ వెర్షన్ గా త్వరలోనే ఇది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు ఈ ఏడాది ఫిలింఫేర్ ఉత్తమనటి అవార్డును నయనతార సొంతం చేసుకున్నారు.
మహిళలపై జరగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడే ఓ స్త్రీ కథాంశంతో వాసుకి సినిమా రూపొందింది. మలయాళంలో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది. `వాసుకి` పేరుతో శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.
లీడ్ రోల్ నయనతార చేయడంతో పాటు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సమస్య కావడంతో సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాపై ఆసక్తిని కనపరుస్తున్నారు. “నయనతారకు ఫిలింపేర్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉంది. మలయాళంలో బ్లాక్బస్టర్ హిట్ అయిన ఈ చిత్రానికి తెలుగులో మంచి క్రేజ్ నెలకొంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది” అని నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలిపారు.