మహాభారతంలో నయనతార?

Saturday,July 08,2017 - 02:00 by Z_CLU

ఇప్పటికే రామాయణంలో నటించింది నయనతార. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించి మెప్పించింది. ఇప్పుడీ సీనియర్ హీరోయిన్ చెంతకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. అదే ద్రౌపది పాత్ర. పంచ పాండవులకు భార్యగా, పాంచాళిగా నటించే అవకాశం నయనతారను వరించింది.

మహాభారతంలోని కీలకమైన ఘట్టాలతో కన్నడలో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేశారు. కన్నడ నటుడు దర్శన్ ఇందులో దుర్యోధనుడిగా కనిపించబోతున్నాడట. ఇక కన్నడ సీనియర్ స్టార్ అంబరీష్ భీష్ముడి పాత్రలో కనిపిస్తాడట. వీళ్లతో పాటు చాలామంది నటీనటులు భారతంలో ఉంటారు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి నయన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డిస్కషన్ స్టేజ్ లో ఉంది. తన వద్దకు ఆఫర్ వచ్చిన విషయాన్ని కన్ ఫర్మ్ చేసిన నయనతార.. ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఈనెల 23న వెల్లడించనున్నారు.