మే నెలలో నయనతార ‘వాసుకి’

Friday,April 21,2017 - 04:30 by Z_CLU

నయనతార మరో లేడీ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ రిలీజ్ కి రెడీ అయింది. మలయాళంలో సూపర్ హిట్టయిన ‘పుదియ నియమం’ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. శ్రీరామ్ మూవీ బ్యానర్ పై S.R మోహన్ రిలీజ్ చేయనున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉంది.

కథాకళి ఆర్టిస్ట్ గా కనిపించనున్న నయనతార ఈ సినిమాలో రెగ్యులర్ గా కనిపించే అతి సాధారణ మహిళ క్యారెక్టర్ లో, ఓ పాపకు తల్లిగా మెస్మరైజ్ చేయనుంది. S.K. షాజన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

అల్టిమేట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులోనూ అదే రేంజ్ లో సక్సెస్ అవ్వడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.