నక్షత్రం ఆడియో రిలీజ్

Tuesday,July 04,2017 - 03:30 by Z_CLU

కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న నక్షత్రం ఆడియో రిలీజ్ రేపు సాయంత్రం 6:30 నిమిషాలకు గ్రాండ్ గా జరగనుంది. చిన్నప్పటి నుండి పోలీసాఫీసర్ కావాలని కలలు కనే ఒక యువకుడి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. సాయి ధరమ్ తేజ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఎట్రాక్ట్ చేయబోతున్నాడు.

ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేసిన సినిమా యూనిట్, జూలై లో సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. తనీష్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, రెజీనా హీరోయిన్స్ గా నటించారు. అల్టిమేట్ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్, సజ్జు కలిసి నిర్మిస్తున్నారు.