మరో మల్టీస్టారర్ లో మన్మధుడు

Friday,December 30,2016 - 06:30 by Z_CLU

2016 లో కార్తీ తో ‘ఊపిరి’ సినిమా చేసిన నాగార్జున 2017 లో కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ ని ఇచ్చే మరో బ్లాక్ బస్టర్ కి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఓం నమో వేంకటేశాయతో సెట్స్ పై ఉన్న నాగ్, రీసెంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా తో సక్సెస్ ని అందుకున్న నిఖిల్ తో సినిమా చేయనున్నాడని టాలీవుడ్ లో టాక్.

గతంలో నిఖిల్ తో కార్తికేయ, నాగచైతన్య తో ప్రేమమ్ చేసిన చందూ మొండేటి ఈ సినిమాకు డైరెక్షన్ చేయనున్నాడని సమాచారం. కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి కానీ నో అనే చెప్పే అలవాటు లేని నాగార్జున ఈ సినిమాతో సెట్స్ పైకి వస్తే 2017 లో కూడా మరో బడా మల్టీస్టారర్ లైన్ అయినట్టే.