నాగార్జున-ఎన్టీఆర్ మల్టీ స్టారర్..

Saturday,March 18,2017 - 12:00 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఊరిస్తున్న నందమూరి అక్కినేని మల్టీ స్టారర్ రెడీ అవుతుంది. ఎన్టీఆర్-ఎన్నార్ కలిసి అప్పట్లో ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలతో ఎంటర్టైన్ చేయగా ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఈ రెండు కుటుంబాల కలయికలో మరో మల్టీ స్టారర్ రాలేదు.

మొన్నా మధ్య నాగార్జున-ఎన్టీఆర్ కలిసి ‘ఊపిరి’ అనే సినిమా చేయాలనుకున్నా ఎన్టీఆర్ ప్లేస్ లోకి సడెన్ గా కార్తీ వచ్చాడు. ఇక అప్పుడు మిస్ అయిన ఈ మల్టీస్టారర్ కాంబినేషన్ ని ప్రెజెంట్ మరో సారి సెట్ చేసే పనిలో పడ్డాడట వంశీ పైడి పల్లి. ఇప్పటికే వీరిద్దరి ఓ అదిరిపోయే పాయింట్ చెప్పాడని మహేష్ బాబుతో చేసే సినిమా తర్వాత వీరిద్దరి ఆ మల్టీస్టారర్ వుండబోతుందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ మల్టీస్టారర్ కనుక సెట్ అయి సెట్స్ పై కి వెళ్తే ఇక రెండు కుటుంబాల అభిమానులకి పండగే…