మరో యాక్షన్ ఎంటర్ టైనర్ లో నాగశౌర్య

Friday,February 28,2020 - 03:02 by Z_CLU

ఇప్పటికే అశ్వథ్థామ లాంటి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేశాడు నాగశౌర్య. ఇప్పుడు మరో యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కేపీ రాజేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ మూవీ లాంఛ్ ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో లాంఛ్ అయింది.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాతగా రాబోతోంది ఈ కొత్త సినిమా. హీరో కల్యాణ్ రామ్ ఈ లాంఛింగ్ కు ప్రత్యేక అతిథిగా హాజరై ముహూర్తం షాట్ కు కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాకు సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.

కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు శౌర్య. ఆ మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుంది.