మరో సినిమా ఫైనల్ చేసుకున్న నాగ శౌర్య
Sunday,May 12,2019 - 11:16 by Z_CLU
సొంత బ్యానర్లో రమణ తేజ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య. రేపటి నుండి వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసేసుకున్నాడు శౌర్య. ‘సుబ్రహ్మణ్యపురం’ దర్శకుడు సంతోష్ జాగర్లపూడితో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించనున్నాడు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రెండు సినిమాలతో శౌర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని మళ్ళీ హిట్ ట్రాక్ లోకోస్తాదేమో..చూడాలి.