Varudu Kaavalenu - మైక్ పట్టిన నాగశౌర్య

Tuesday,April 06,2021 - 03:36 by Z_CLU

ప్రస్తుతం లక్ష్మి సౌజన్య అనే కొత్త దర్శకురాలితో ‘వరుడు కావలెను’ సినిమా చేస్తున్నాడు నాగ శౌర్య. ఇటివలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నాడు నాగ శౌర్య. హీరో తో పాటే హీరోయిన్ రీతు వర్మ కూడా సినిమాకు డబ్బింగ్ చెప్పుకుంది.

ఇప్పటికే విడుదల చేసిన నాగ శౌర్య బర్త్ డే టీజర్ తో పాటు ‘కోల కళ్ళే ఇలా’ సాంగ్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అతి త్వరలోనే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్ గా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.

పెళ్లి చుట్టూ అల్లుకున్న లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు.  విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Also Read ‘రి పబ్లిక్’ టీజర్ రివ్యూ

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics