నాగచైతన్య-సాయిపల్లవి సినిమా ప్రారంభం

Thursday,June 27,2019 - 05:32 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ జోడీ సెట్స్ పైకి వచ్చేస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా కొత్త సినిమా ఈరోజు మొదలైంది. ప్రేమకథల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ఆ తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. వారి ఆసక్తిని డబుల్ చేస్తూ ఈ క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతున్నాడు కమ్ముల. మజిలీ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా సినిమాలు చేస్తోన్న నాగచైతన్య హీరోగా.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండడం ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ ను పెంచింది.

ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభం అయిన ఈ సినిమాను సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి తీసుకొచ్చి, ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.