ఆయుధ పూజ జరుపుకున్న ‘నా పేరు సూర్య’ టీమ్

Friday,September 29,2017 - 12:40 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ సినిమా యూనిట్  ప్రస్తుతం ఊటీలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే దసరా పండగ సందర్భంగా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్న టీమ్ ఆయుధపూజ జరుపుకుంది. ఈ సందర్భంగా టీమ్ తో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశాడు అల్లు అర్జున్.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటిస్తుంది. శరత్ కుమార్, బోమన్ ఇరానీ తో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 27 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.