Acharya Contraversy.. సీన్ లోకి 'మైత్రీ'

Thursday,August 27,2020 - 07:33 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఆచార్య వివాదం (Acharya Contraversy) లో మైత్రీ మూవీ మేకర్స్ పేరు కూడా వినిపిస్తోంది. ఊహించని విధంగా ఈ వివాదంలోకి తమ పేరు రావడంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి క్లియర్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.

ఆరోపణలు చేస్తున్న రాజేష్ అనే వ్యక్తి నుంచి కథ విన్న మాట వాస్తవమేనని అంగీకరించిన Mythri Movie Makers సంస్థ.. ఆ కథ నచ్చకపోవడంతో అప్పుడే రిజెక్ట్ చేశామని ఎనౌన్స్ చేసింది.

“గతంలో మేము నూతన దర్శకులలో డియర్‌కామ్రేడ్‌ (భరత్‌కమ్మ), మత్తువదలరా (రితేష్‌రానా), ప్రస్తుతం ‘ఉప్పెన’ (బుబ్చిబాబు సానా) సినిమాలను నిర్మించాం. రాజేష్‌ మాకు వినిపించిన కథ బాగుంటే అతనితో కూడా సినిమా నిర్మించేవాళ్లం. కథ బాగాలేకపోవడంతో అతని కథను తిరస్కరించాం. ఇక బాలేని కథతో వేరే వారికి సినిమా నిర్మించాలని ఎందుకు చెబుతాం? దర్శకుడిగా, రచయితగా కొరటాల శివ (Koratala Shiva) ప్రతిభ గురించి అందరికి తెలుసు. కమర్షియల్‌ అంశాలతో పాటు తన ప్రతి సినిమాలో సామాజిక ప్రయోజనం కూడా జోడించే కొరటాల శివ గారిపై ఎటువంటి ఆధారాలు లేకుండా అర్థరహితమైన ఆరోపణలు చేయడం సరికాదు. మీడియాలో రాజేష్‌ చేసిన ఆరోపణలు ఖండించడంతో పాటు ఆయనపై తగిన చర్చలు తీసుకుంటాం. రాజేష్‌ చేసిన చౌకైన జమ్మిక్కులను అతని ఆరోపణలను అందరూ విస్మరించాలని కోరుకుంటున్నాం.”