అభిమానులతో పాటు అందరికీ నచ్చుతుంది

Monday,January 07,2019 - 01:12 by Z_CLU

‘మిస్టర్ మజ్ను’ తో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు అఖిల్.. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో అఖిల్ నటించిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ప్రెజెంట్ షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జనవరి 25 న గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అఖిల్.. ఇటివలే జరిగిన రెండు మూడు ఈవెంట్స్ లో కూడా ఈ సినిమా అభిమానులతో పాటు అందరికీ నచ్చేలా ఉంటుందన్నాడు. ఈసారి చాలా జాగ్రత్త తీసుకున్నాం. వెంకీ స్క్రీన్ ప్లే , తమన్ మ్యూజిక్ ఇలా ప్రతీ ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది… అంటూ చెప్పుకొచ్చాడు.

లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో వెంకీ అట్లూరి కూడా సినిమా గురించి మాట్లాడాడు.. “అందరికీ కనెక్ట్ అయ్యేలా మరో లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. అఖిల్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపించే ప్రయత్నం చేసాము. అంటూ తెలిపాడు. సో ‘మిస్టర్ మజ్ను’తో అఖిల్ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.


ఈ సినిమాకు సంబంధించి ఇటివలే మూడో సింగిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్.. “నాలో నీకు” అంటూ సాగే ఈ సాంగ్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఆల్బంలో మరో బ్యూటిఫుల్ మెలోడీ అనిపించుకుంటుంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ అందించారు.