క్రిస్మస్ కానుక రెడీ చేసిన ‘మిస్టర్ మజ్ను’

Monday,December 24,2018 - 06:41 by Z_CLU

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శ్రీమణి అద్భుతమైన సాహిత్యానికి థమన్ అందించిన వీనుల విందైన సంగీతం తోడవడంతో ఈ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఇక రెండో పాటను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా సాయంత్రం 6 గంటలకు ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

నటీనటులు: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది
సంగీతం: థమన్
పాటలు: శ్రీమణి
సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్లా
కొరియోగ్రఫీ: శేఖర్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి