గాయత్రి ట్రయిలర్ రివ్యూ

Monday,January 29,2018 - 12:38 by Z_CLU

మోహన్ బాబు లీడ్ రోల్ లో నటించిన సినిమా గాయత్రి. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను తాజాగా విడుదల చేశారు. హై-ఎండ్ ఎమోషనల్ కంటెంట్ తో గాయత్రి సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

గాయత్రిలో మరోసారి తన విశ్వరూపం చూపించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ట్రయిలర్ లో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ సింప్లీ సూపర్బ్. డైమండ్ రత్నం రాసిన డైలాగ్స్, తుటాల్లా మోహన్ బాబు నోట వస్తుంటే… ట్రయిలర్ అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. శ్రియ, మంచు విష్ణు ఎప్పీయరెన్స్ కూడా ట్రయిలర్ లో హైలెట్ గా నిలిచింది. సినిమా స్టోరీ ఏమై ఉంటుందనే విషయాన్ని వన్ పర్సెంట్ కూడా ట్రయిలర్ లో చూపించకపోవడం విశేషం.

మోహన్ బాబు వన్ మేన్ షో, డైమండ్ రత్నం పెన్ను పవర్ గాయత్రికి మెయిన్ ఎస్సెట్స్. ఇక యాంకర్ కమ్ నటి అనసూయకు గాయత్రి రూపంలో మరోసారి మంచి పాత్ర దొరికింది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సర్వేష్ మురారి సినిమాటోగ్రాఫీ ప్రత్యేక ఆకర్షణ. ఓవరాల్ గా గాయత్రి ట్రయిలర్ సినిమాపై అంచనాల్ని ఎన్నో రెట్లు పెంచేసింది.