ఫిబ్రవరి 9 న మోహన్ బాబు ‘గాయత్రి’ రిలీజ్

Thursday,December 14,2017 - 11:06 by Z_CLU

 విలక్షణ నటుడు డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో చివరి షెడ్యూల్ షూటింగ్ నేటితో పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. విష్ణు సరసన శ్రియ నటించగా, ఇటీవలే వీరిరువురిపై కీలక సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు.

నిఖిలా విమల్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతుండగా, నిర్మాతలు ఫిబ్రవరి 9, 2018 ను విడుదల తేదీగా ఖరారు చేసారు. ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మానందం, అనసూయ కనిపించనున్నారు. ప్రతిష్టాత్మక ‘శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పిస్తున్నారు.

సంగీతం: ఎస్.ఎస్.తమన్,

ఛాయాగ్రహణం: సర్వేశ్ మురారి,

ఆర్ట్: చిన్న,

ఎడిటర్: ఎం.ఎల్.వర్మ,

ఫైట్స్: కనల్ కణ్ణన్,

కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య.

కో-డైరెక్టర్స్: అనిల్ కుమార్ కె.వి.ఎస్.ఎన్, గుణ నాగేంద్ర ప్రసాద్, రవి బయ్యవరపు

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయకుమార్.ఆర్

నిర్మాత: డా. మోహన్ బాబు యమ్.

దర్శకత్వం: మదన్ రామిగాని