యాక్షన్ సీక్వెన్సెస్ మేకింగ్ ప్రాసెస్ లో ‘గాయత్రి’

Wednesday,January 10,2018 - 01:33 by Z_CLU

మోహన్ బాబు నటిస్తున్న హై ఇంటెన్సివ్ థ్రిల్లర్ ‘గాయత్రి’ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్ అధ్వర్యంలో ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉంది గాయత్రి టీమ్.

అయితే ఈ సినిమాలో మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగే ఫైట్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తుంది సినిమా యూనిట్, ఈ సీక్వెన్సెస్ కోసం ఆస్ట్రేలియా నుండి తెప్పించిన ‘నేరో మోషన్ కంట్రోల్’ స్టంట్ రిగ్ వాడుతున్నట్లు సమాచారం.

గత వారం రోజులుగా ఈ యాక్షన్ మేకింగ్ ప్రాసెస్ లో ఉన్న గాయత్రి టీమ్, మరో 4 రోజుల్లో ఈ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో విష్ణు మంచు కీ రోల్ ప్లే చేస్తున్నాడు. విష్ణు సరసన శ్రియ హీరోయిన్ గా నటిస్తుంది. ఫిబ్రవరి 9 న రిలీజవుతున్న ఈ సినిమా మదన్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.