సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న గాయత్రి

Friday,February 02,2018 - 10:03 by Z_CLU

ఫిబ్రవరి 9 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది మోహన్ బాబు గాయత్రి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంటే, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ‘ఒక నువ్వు ఒక నేను’ అనే సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేస్తుంది.

మంచువిష్ణు పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ పొందింది. మంచి విష్ణు సరసన హీరోయిన్ గా నటించిన  శ్రియ శరన్ సినిమాకి మరింత ఫ్రెష్ నెస్ ని ఆడ్ చేస్తుంది. మదన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యూత్ ని మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్.

 

నిఖిల విమల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాని మోహన్ బాబు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. S.S. తమన్ మ్యూజిక్ కంపోజర్.