ప్యాకప్.. మిస్టర్ షూటింగ్ కంప్లీట్

Wednesday,April 05,2017 - 04:09 by Z_CLU

శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ చేస్తున్న సినిమా మిస్టర్. తాజాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఓ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన యూనిట్ ఆ పోర్షన్ కూడా కంప్లీట్ చేేసింది. దీంతో మిస్టర్ మూవీకి సంబంధించి టోటల్ షూటింగ్ కంప్లీట్ అయింది. షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా వరుణ్ తేజ ఓ పిక్ పోస్ట్ చేశాడు.

మిస్టర్ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ కూడా వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 13న విడుదల చేస్తున్నట్టు ఇన్నాళ్లూ ప్రకటించారు. అయితే ఏప్రిల్ 13న కాకుండా… ఏప్రిల్ 14న థియేటర్లలోకి వస్తున్నట్టు హీరో వరుణ్ తేజ, దర్శకుడు శ్రీనువైట్ల ట్వీట్ చేశారు. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను ఇంతకుముందే అనుకున్నట్టు ఏప్రిల్ 7నే నిర్వహించబోతున్నారు.

మిస్టర్ సినిమాలో వరుణ్ తేజ సరసన లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన పాాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా విడుదలైన ట్రయిలర్ ఈ అంచనాల్ని మరింత పెంచింది.