లాక్ డౌన్ తర్వాత రోడ్ ట్రిప్
Thursday,June 04,2020 - 03:21 by Z_CLU
లాక్ డౌన్ తర్వాత ఏం చేయాలనే అంశంపై ఇప్పటికే చాలామంది హీరోయిన్లు రియాక్ట్ అయ్యారు. ఎక్కువమంది షూటింగ్స్ కు వెళ్తామని చెప్పినప్పటికీ.. సేమ్ టైమ్ హాలిడే ప్లాన్ చేస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు మెహ్రీన్ కూడా తన మనసులో మాట బయటపెట్టింది.
లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వీలైనంత తొందరగా రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తానంటోంది మెహ్రీన్. రాజస్థాన్ లో రోడ్ ట్రిప్ అంటే తనకు చాలా ఇష్టమని, ఈసారి లడక్ కూడా రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుంటున్నట్టు తెలిపింది.
లాక్ డౌన్ తర్వాత కేరళలోని బెకల్ బీచ్ కు వెళ్తానని పూజా హెగ్డే ఇప్పటికే ప్రకటించింది. అటు తాప్సి ఓ జపనీస్ రెస్టారెంట్ కు వెళ్తానని, ఆ రుచులు బాగా మిస్సవుతున్నానని చెప్పుకొచ్చింది. కియారా అద్వానీ తన ఫ్రెండ్స్ తో కలిసి సినిమా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తానని తెలిపింది. ఇప్పుడు మెహ్రీన్ ఇలా రోడ్ ట్రిప్ ఆలోచనను బయటపెట్టింది. ఇలా హీరోయిన్లంతా ఎవరి ప్లాన్స్ లో వాళ్లున్నారు.