వినాయక్-సాయిధరమ్ తేజ్ మూవీ ప్రారంభం

Wednesday,August 09,2017 - 12:42 by Z_CLU

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ హీరోగా మెగా డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 9గంటల 27 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మెగాస్టార్‌ చిరంజీవి చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ అంటూ అందించిన ఆశీస్సులతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

హీరో సాయిధరమ్‌తేజ్‌పై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్‌ నివ్వగా, మరో ప్రముఖ రచయిత సత్యానంద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన ఆకుల శివ ఫస్ట్‌ షాట్‌ని డైరెక్ట్‌ చేశారు. సినిమాలో తేజూ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించనుంది.

సాయిధరమ్‌తేజ్‌, వినాయక్‌ కాంబినేషన్‌లో ఇదే మొదటి చిత్రం. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.