మెగా ఫ్యామిలీ లో యంగ్ హీరోలు ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు. బన్నీ, రామ్ చరణ్ రెండేసి సినిమాలతో బిజీ అవుతుంటే, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, శిరీష్ లు కూడా వరుస సినిమాలతో కాస్త స్పీడ్ పెంచేశారు.
‘ముకుంద’ సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ తేజ్ ‘కంచె’ తో హీరో గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘కంచె’ విజయం ఇచ్చిన ఉత్సాహం తో హీరో గా స్పీడ్ పెంచేశాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ అయిపోయాడు. ఓ పక్క శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ సినిమాలో నటిస్తూనే, మరో వైపు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ‘ఫిదా’ అనే సినిమా చేస్తున్నాడు.
మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ అయిపోయాడు. ఓ వైపు గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్న తేజూ… మరో వైపు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ లో సందీప్ కిషన్ తో పాటు మరో ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు తనకి హీరో గా గుర్తింపు తెచ్చిన ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి దర్శకత్వం లో మరో సినిమా చెయ్యడానికి సిద్దమవుతున్నాడు.
‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న అల్లు శిరీష్ కూడా రెండు సినిమాలకు సై అంటున్నాడు. డైరెక్టర్ ‘వి.ఐ.ఆనంద్’ తో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న శిరీష్… సైమల్టేనియస్ గా మరో సినిమా కూడా చేసేందుకు డైరక్టర్ వేటలో పడ్డాడు.