'మన్మథుడు 2' కి లైన్ క్లియర్ !

Tuesday,August 06,2019 - 03:38 by Z_CLU

నాగార్జున , రకుల్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘మన్మథుడు2’ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాకు సంబంధించి  సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ప్రస్తుతం నాగార్జున, రాహుల్, రకుల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆగస్ట్ 9న సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో నాగార్జున క్యారెక్టర్ , రకుల్ గ్లామర్, కామెడీ సినిమాపై అంచనాలు పెంచేసాయి. సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్ బ్యానర్స్ పై నాగార్జున, కిరణ్ నిర్మించిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజర్.