మహేష్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ ?

Sunday,January 12,2020 - 12:02 by Z_CLU

ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న మహేష్ బాబు నెక్స్ట్ వంశీ పైడిపల్లి తో సినిమా చేయబోతున్నాడు. ఇటివలే తమ కాంబో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు ప్రిన్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా మార్చ్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ వరుసగా దేవితో వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మళ్ళీ మహేష్ -మణిశర్మ కాంబో రిపీట్ అవ్వనుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.