PS1 ట్రైలర్ తో హైప్ పెంచేసిన మణిరత్నం

Wednesday,September 07,2022 - 12:34 by Z_CLU

Maniratnam’s ‘PS1’ Theatrical Trailer Review

విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి , జయం రవి , త్రిషలతో మణిరత్నం తీస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ ట్రైలర్ రిలీజైంది. చెన్నై లో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రజినీ కాంత్ , కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వేయి సంవత్సరాల క్రితం , చోళ నాట స్వర్ణ శకం ఉదయించక మునుపు అంటూ దగ్గుబాటి రానా వాయిస్ ఓవర్ తో గ్రాండియర్ విజువల్స్ తో మొదలైన ట్రైలర్ లో అంటూ రవి వర్మన్ గ్రాండియర్ విజువల్స్ , రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , తోటతరణి ఆర్ట్ వర్క్ , కెచా, శ్యామ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గ్లిమ్స్ హైలైట్ గా నిలిచాయి. అలాగే తనికెళ్ళ భరణి అందించిన డైలాగ్స్ ట్రైలర్ లో మరో అట్రాక్షన్ గా నిలిచాయి.

చోళ రాజ్యంలో ఒకరిని బలికోరిన తోకచుక్క, రక్షణకై ఒకరు ఆధిపత్యం కోసం మరొకరు యుద్దాలు చేసుకోవడం, ఆడవాళ్ళూ ఇందులో భాగమవడం…చివరికి ఈ కథ ఏ మజిలీకి చేరుకుందనేది పిఎస్ 1ని తెరమీద చూసి తెలుసుకోవాలని రానా వాయిస్ ఓవర్ తో ట్రైలర్ చూపించి సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు మణిరత్నం.

లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరణ్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బేనర్ పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లోకి రాబోతుంది.

 

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics