రామ్, మణిశర్మ కాంబోలో మొదటి సినిమా

Monday,January 07,2019 - 06:49 by Z_CLU

రామ్ సినిమాకు తొలిసారిగా మణిశర్మ సంగీతం అందించబోతున్నాడనే విషయాన్ని జీ సినిమాలు 2 రోజుల కిందటే ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చింది. ఇప్పుడా కాంబోకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు.

పూరి జగన్నాధ్, మణిశర్మ కాంబినేషన్ లో ఇది ఆరో సినిమా. గతంలో పూరీ జగన్నాథ్, మణిశర్మ కలిసి పని చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఇద్దరూ చివరగా టెంపర్ సినిమాకు కలిసి పనిచేశారు. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. టెంపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రామ్ హీరోగా నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు మణిశర్మ.

ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి చివర్లో మొదలు కానుంది. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు.

సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్
సమర్పణ: లావణ్య
నిర్మాణ సంస్థలు: పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్
సంగీత దర్శకుడు: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట