మహేష్ చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్

Tuesday,January 09,2018 - 11:12 by Z_CLU

మహేష్ బాబు సిస్టర్ మంజుల ఘట్టమనేని ఫస్ట్ టైం డైరక్టర్ గా మారి తెరకెక్కించిన సినిమా మనసుకు నచ్చింది. ఈ సినిమా కథ కూడా ఆమెదే. మంజుల చేసిన ఈ ప్రయత్నాన్ని మరింత ప్రోత్సహించడానికి రెడీ అయ్యాడు మహేష్. ఈ మూవీకి మరింత ప్రచారాన్ని కల్పించేందుకు “మనసుకు నచ్చింది” ట్రయిలర్ ను తన చేతుల మీదుగా విడుదల చేయబోతున్నాడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ ట్రయిలర్ ను లాంచ్ చేయబోతున్నాడు మహేష్.

మనసుకు నచ్చింది సినిమాలో సందీప్ కిషన్, అమైరా దస్తర్ హీరోహీరోయిన్లుగా నటించారు. త్రిథా చౌదరి సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఆనంది ఆర్ట్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై జెమినీ కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మాతలుగా తెరకెక్కింది ఈ సినిమా.

జనవరి 26న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అర్జున్ రెడ్డి ఫేం రథన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశాడు.