పవన్ కళ్యాణ్ కోసం కథ రాసిన మంజుల

Saturday,February 10,2018 - 10:03 by Z_CLU

మంజుల డైరెక్షన్ లో తెరకెక్కింది ‘మనసుకు నచ్చింది’ సినిమా. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 16 న గ్రాండ్ గా రిలీజవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో మంజుల, పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేసుకున్నట్టు చెప్పుకుంది.

‘పవన్ కళ్యాణ్ గారు వెరీ జెన్యూన్ పర్సన్. ఆయన మనసుకు నచ్చింది చేసే మనిషి.  ఆయన ఇకపై సినిమాలు చేయకపోవచ్చు కానీ ఒక్కసారి ఈ కథ విన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పలేరు. అంత అద్భుతంగా ఉంది కథ. ఈ ఒక్క సినిమా చేసి ఆయన పోలిటిక్స్ కి వెళ్లిపోవచ్చు.’ అని నవ్వుతూ చెప్పుకుంది మంజుల.

సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఫ్రెష్ & రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాధన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.