ఆగస్టు 5న `మనమంతా` విడుదల

Saturday,July 16,2016 - 10:59 by Z_CLU

 

ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `మనమంతా`. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది.

22 ఏళ్ళ తర్వాత మోహన్ లాల్ ప్రధానపాత్రలో నటించిన చిత్రమిది. గౌతమి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు.

మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నాలుగు దశలైన బాల్యం, యవ్వనం, కౌమార దశల్లోని నలుగురు వ్యక్తుల ప్రయాణమే ఈ చిత్రం.

ఈ చిత్రంలో మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావ్, అనీషా, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, అయ్యప్పశర్మ, వెన్నెలకిషోర్, బ్రహ్మాజీ, నవీన్ నేని, ధన్ రాజ్, ప్రవీణ్, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, ఎడిటింగ్: జి.వి.చంద్రశేఖర్, సంగీతం: మహేష్ శంకర్.