న్యూ ఇయర్ కానుకగా ‘రాజా నరసింహా’

Tuesday,December 24,2019 - 06:29 by Z_CLU

మమ్ముట్టి హీరోగా నటించిన ‘రాజా నరసింహా’ జనవరి 1 న రిలీజవుతుంది. మలయాళంలో ‘మధుర రాజా’ గా రిలీజై బ్లాక్ బస్టర్ అయిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెలుగులో కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.

టాలీవుడ్ లో మమ్ముట్టికి మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు గతంలో రిలీజై మలయాళంలో తో పాటు తెలుగులో కూడా సక్సెస్ అందుకున్న ‘మన్యంపులి’ దర్శకుడు వైశాక్ దర్శకవంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఆడియెన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలున్నాయి.

ఈ సినిమాలో అను శ్రీ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు , తమిళ హీరో జై ముఖ్య పాత్రలు పోషించారు. జై చెన్నకేశవ పిక్చర్స్‌ బ్యానర్ పై సాధు శేఖర్‌ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.