ఒకే సారి రెండు సినిమాలు చేసేస్తున్నారు..

Wednesday,July 20,2016 - 12:35 by Z_CLU

 

టాలీవుడ్ లో ప్రస్తుతం మలయాళ ముద్దుగుమ్మల హవా నడుస్తుంది. ఒక సినిమా చేస్తూనే మరో సినిమా ను కూడా లైన్ లో పెట్టేస్తున్నారు మల్లు కథానాయికలు. ఇందుకు కారణం టాలీవుడ్ లో హీరోయిన్ ల కొరత తో పాటు మలయాళీ ముద్దుగుమ్మలు నటన తో అలరిస్తుండడమే. అయితే మలయాళం లో ‘ప్రేమమ్’ తో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ అనుపమ పరమేశ్వర్ కు తెలుగు ప్రేమమ్ రీమేక్ లోనూ అదే పాత్ర దక్కింది. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే త్రివిక్రమ్ ‘ఆ ఆ’ లో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. ఇక మరో మలయాళీ కథానాయిక నమిత ప్రమోద్ కూడా ఓ పక్కన ఆది తో చుట్టాలబ్బాయి లో నటిస్తూనే నారా రోహిత్ తో ‘కథలో రాజా కుమారి’ లో నటిస్తుంది. మరో పక్క మలయాళీ భామ అను ఇమ్మాన్యుయేల్ కూడా ఇలాగే రెండు సినిమాలు చేసేస్తోంది. ఓ పక్క నాని తో నటిస్తూనే మరో పక్క గోపి చంద్ ఆక్సిజన్ లో కూడా నటిస్తుంది ఈ నాయిక. త్వరలోనే వీరి సరసన చేరబోతోంది మలర్ భామ సాయి పల్లవి. మరి ఇలా మలయాళీ హీరోయిన్స్ టాలీవుడ్ లో రెండేసి సినిమాలు చేసేస్తూ టాలీవుడ్ నాయికలకు గట్టి పోటీనే ఇస్తున్నారు.