ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో 'మళ్లీ మళ్లీ చూశా'

Sunday,January 06,2019 - 09:40 by Z_CLU

అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న సినిమా “మళ్లీ మళ్లీ చూశా”. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటివలే రిలీజయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ , మోషన్ పొస్టర్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ ఆకట్టుకుంది.

ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. కథే ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

ప్రభాకర్, టి.ఎన్.ఆర్, మిర్చి కిరణ్, అప్పాజీ, బ్యాంక్ శీను, మధుమణి, పావని,ప్రభావతి, జయలక్ష్మి, రీతూ చౌదరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్,ఛాయాగ్రాహకుడు : సతీష్ ముత్యాల, మాటలు : హేమంత్ కార్తీక్,ఎడిటర్ : సత్య గిడుతూరి,పాటలు : తిరుపతి జావాన,కళా దర్శకుడు : సుమిత్ పటేల్ బి.ఫ్.ఏ,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాలకుర్తి, నిర్మాత : కోటేశ్వరరావు కొణిదెన, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సాయిదేవ రామన్.