మజిలీ సెన్సార్ పూర్తి, తిరుమలలో చైతూ-సమంత

Tuesday,April 02,2019 - 01:24 by Z_CLU

నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మజిలీ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

చాన్నాళ్ల తర్వాత మంచి కంటెంట్ తో ఓ సినిమా చేశానంటున్నాడు నాగచైతన్య. తన గత సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్, సాంగ్స్ కోసం తాపత్రయపడేవాడినని,… కానీ మజిలీ సినిమాను కేవలం కథపై ఆధారపడి చేశానన్నాడు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది. గోపీసుందర్ ఈ సినిమాకు పాటలు కంపోజ్ చేస్తే, తమన్ రీ-రికార్డింగ్ చేశాడు. మరోవైపు ఈ సినిమా సక్సెస్ కోసం చైతూ-సమంత తిరుమల వెళ్లారు. సమంత అయితే కాలినడకన తిరుమల చేరుకుంది.