నిర్మాత‌గా మారిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ‌

Saturday,March 02,2019 - 11:15 by Z_CLU

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్, అత‌ని స‌న్నిహితులైన శివ‌ మేక‌, రాకేష్ మహ‌ంకాళి సంయుక్తంగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ పేరిట ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని స్థాపించారు. సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుద‌ల చేసే ప‌ద్ధ‌తికి పూర్తి భిన్నంగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ అడుగులు వేస్తోంది.

ఔత్సాహికులైన ర‌చ‌యిత‌ల్ని, సినిమా  క‌థ‌లు రాయ‌గలిగే స‌త్తా ఉన్న యువ ఫిల్మ్ రైట‌ర్స్ ని ప్రొత్స‌హిస్తూ వారి చేత కొత్త కొత్త క‌థ‌ల్ని త‌యారుచేయించ‌డం త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఒక్క మాట‌లో చెప్పాలంటే, ర‌చ‌యిత మేథ‌లో పుట్టిన విత్త‌నాన్ని(సింగిల్ లైన్) జాగ్ర‌త్త‌గా పెంచి పోషించి మ‌హా వృక్షంగా(పూర్తి స్క్రిప్ట్) మార్చడం మ‌హి వి రాఘ‌వ‌, మిత్ర బృందం ముఖ్య ఉద్దేశం.

క‌థ‌ల‌కి, క‌థ‌కుల‌కి డ‌బ్బులు పెడుతూ అలా పురుడు పోసుకున్న స్క్రిప్ట్స్ ని ప‌లు నిర్మాణ సంస్థల‌తో క‌లిసి నిర్మించేందుకు కూడా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ ముందుంటుద‌ని మ‌హి వి రాఘ‌వ తెలిపారు. కేవ‌లం సినిమాల‌నే కాకుండా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంట‌రీలకి సంబంధించిన ర‌చ‌యిత‌లు, ఫిల్మ్ మేక‌ర్స్, నిర్మాణ సంస్థ‌లు, ఛాన‌ల్ పార్ట‌న‌ర్స్ తో జ‌త‌క‌లిసేందుకు త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ స‌ముఖంగా ఉంద‌ని మ‌హి వి రాఘ‌వ తెలిపారు.