Mahi V Raghav - నెక్ట్స్ మూవీకి రెడీ

Friday,July 02,2021 - 01:13 by Z_CLU

‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్న మహి వి రాఘవ్ నెక్స్ట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. జెర్సీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రద్దా శ్రీనాథ్ తో లేడీ ఒరియంటెడ్ సినిమా చేయనున్నాడు మహి. ఇటివలే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. యూ.వీ క్రియేషన్స్ బేనర్ పై వంశీ , ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

సోషల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ పాత్ర కీలకంగా ఉంటుంది. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను సున్నితంగా ఇందులో చూపించనున్నాడు మహి. అందుకే కథకు ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇందులో పోసాని లాంటి సీనియర్ నటులు మంచి పాత్రలు చేయనున్నారు.

Shraddha-Srinath-horror-movie

యాత్ర సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న మహి వి రాఘవ్ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానున్నాడు. హైదరాబాద్ లో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా షూట్ ఫినిష్ చేసి ఈ ఏడాది ఎండింగ్ లోపు రిలీజ్ కి రెడీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత మహి వి రాఘవ్ నితిన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక మహి లైనప్ లో ‘యాత్ర 2’కూడా ఉంది. దానికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. ఆ సినిమాను వచ్చే ఎన్నికల సమయంలో చేసే ఆలోచనలో ఉన్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics