Mahesh Trivikram - 11 ఏళ్ళ తర్వాత!

Saturday,May 01,2021 - 06:48 by Z_CLU

కొన్ని కాంబినేషన్స్ సినిమాలు ఎప్పుడెప్పుడు సెట్ అవుతాయా ? అని అభిమానులు ఎదురుచూసేలా చేస్తుంటాయి. మహేష్ -త్రివిక్రమ్ లది అలాంటి కాంబోనే. ‘అతడు’ సినిమాతో కలిసిన ఈ కాంబోలో ఆ తర్వాత ‘ఖలేజా’ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఈ కాంబోలో సినిమా రాలేదు. అప్పటి నుండి వీరిద్దరి కలయికలో వచ్చే మూడో సినిమా గురించి ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మధ్యలో ఇద్దరూ కలిసి సినిమా చేయాలనుకున్నా ఎందుకో కుదరలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది. వీళ్ళిద్దరి కాంబో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు మేకర్స్.

11 ఏళ్ల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో వస్తున్నఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని వీడియో ద్వారా తెలియజేశారు. అదే వీడియోలో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్స్ లోకి రానుందని ప్రకటించారు. #SSMB28 టైటిల్ తో ఎనౌన్స్ అయిన ఈ కాంబో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేళ్ళ తర్వాత మూడో సినిమా కోసం కలిసిన మహేష్ -త్రివిక్రమ్ ఎలాంటి కథతో వస్తున్నారు ? అనే డిస్కషన్ మొదలైంది. ఈ సినిమాకి తనకి కలిసొచ్చిన ఫ్యామిలీ డ్రామానేపథ్యంతోనే త్రివిక్రమ్ తెరకెక్కించనున్నాడని సమాచారం.

మహేష్ -త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘అతడు’ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘ఖలేజా’ అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. నటీనటులతో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.

ఇక సర్కారు వారి పాట షూటింగ్ పూర్తవ్వగానే మహేష్ ఈ సినిమాను మొదలు పెట్టనున్నాడు. అప్పటి వరకు సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics