Trivikram Mahesh - ఫార్మాలిటీస్ పూర్తి

Friday,April 23,2021 - 06:40 by Z_CLU

సర్కారువారి పాట తర్వాత మహేష్ బాబు చేసే సినిమా లాక్ అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి స్టోరీ లాక్ అవ్వడంతో పాటు ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. లాంగ్ గ్యాప్ తర్వాత Mahesh Trivikram కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.

ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి అతడు అనే సినిమా చేశాడు. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్లాసిక్స్ అనిపించుకుంది ఈ సినిమా. ఆ తర్వాత ఖలేజా సినిమా చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ కలిసి వర్క్ చేయలేదు మహేష్-త్రివిక్రమ్. మధ్యమధ్యలో కలిసి యాడ్స్ చేసినప్పటికీ మూవీ మాత్రం మెటీరియలైజ్ అవ్వలేదు.

నిజానికి SarkaruVaari Paata తర్వాత మహేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్ సెట్స్ పైకి వస్తుందని అంతా అనుకున్నారు. ఆ మేరకు స్టోరీ డిస్కషన్లు కూడా జరిగాయి. కానీ మధ్యలో త్రివిక్రమ్ ఎంటరవ్వడంతో లెక్కలన్నీ మారిపోయాయి.

సర్కారువారి పాట సినిమా షూటింగ్ లో కరోనా కేసులు బయటపడ్డంతో షూటింగ్ ఆపేశారు. మహేష్ క్వారంటైన్ లో ఉన్నాడు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తిచేశాడు.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. మహేష్ కూడా సహ-నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఎప్పట్లానే ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం అందించబోతున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే టాక్ నడుస్తోంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics