మార్చ్ నుండి సెట్స్ పైకి

Monday,January 14,2019 - 11:01 by Z_CLU

మహేష్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా మార్చ్ నుండి సెట్స్ పైకి రానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న మేకర్స్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలెట్టేసారు. రంగస్థలం తర్వాత క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. లేటెస్ట్ గా సోషల్ మీడియా ద్వారా సుకుమార్ కి బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్ మన సినిమా ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నా సార్ అంటూ పోస్ట్ చేసాడు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి మరో వైపు ఆర్టిస్టులను కూడా ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నాడు సుకుమార్. అన్ని కుదిరితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.